వాహనం దూసుకెళ్లి...

చిత్తూరుజిల్లాలోని కొత్త బస్టాండ్ వద్ద బోలేరో వాహనం రోడ్డు దాటుతున్న కళాశాల విద్యార్ధులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజ్ఞానసుధ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న హంస, విద్యార్ధి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నఅజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన వేదవతి, కల్పన, యోగేశ్వరిలను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సత్యప్రభ బాధితులను పరామర్శించారు. మృతి చెందిన వారిలో హంస స్వస్థలం చిత్తూరు మండలం మర్రిగుంట కాగా అజయ్ స్వస్థలం యాదమర్రి మండలంలోని కొటాల గ్రామం.