పుంగనూరు సైదల్లా గుట్ట వద్ద ఏనుగు పిల్ల మృతి
Published on: Mon Aug 25, 2025 11:24AM

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలో సైదల్లా గుట్ట వద్ద ఏనుగు పిల్ల మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం తెలిపారు. జూలై 5వ తేదీ తల్లి ఏనుగు పెద్ద ఒడ్డు చెరువు కట్టపై నుంచి జారిపడి మృతి చెందిగా పాలు లేక పిల్ల ఏనుగు మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి డిఎఫ్ఓ వివేక్, వెటర్నరీ డాక్టర్లు చేరుకొని మృతి చెందిన పిల్ల ఏనుగుకు శవ పంచనామా నిర్వహించి ఖననం చేశారు.


