సొంత పార్టీ పైన అవిశ్వాస౦ హస్యాస్పదం: చిరు

 

 

 

యూపీఎ ప్రభుత్వం మీద సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం హస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర విభజన విషయంలో సరయిన సమయంలో ఎవ్వరూ స్పందించలేదు. ఈ సమయంలో ఇలా చేయడం తప్పు. లోక్ సభలో ఈ తీర్మానం పెట్టడం ఏ మాత్రం ఉపయోగకరం కాదు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎంపీలు తీసుకున్న నిర్ణయం తప్పని అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయామని సోనియాగాంధీ రాజీనామాను కోరడం సరికాదు. గెలుపు..ఓటములు రాజకీయాలలో సహజం. తెలంగాణ విషయంలో అధిష్టానం మీద వత్తిడులు తేవడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అని చిరంజీవి అన్నారు.