TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరంజీవికి మంత్రి పదవి ఎప్పుడు?

Published on: Mon Apr 16, 2012 3:43PM

రాజ్య సభకు ఎన్నికైన చిరంజీవి కి మంత్రి పదవి ఎప్పుడు లభిస్తుందా? అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్బంగా చిరంజీవి, కాంగ్రెస్ నాతల మద్య కుదీరిన ఒప్పందాలు ఏమిటో అధికారకంగా బయటకు రాలేదు. చిరంజీవి కూడా ఢిల్లీలో సోనియా గాంధీనీ కలిసి బయటకు వచ్చిన అన౦తరం విలీనం చేసినట్టు ప్రకటించారే కానీ, విలీనానికి ప్రతిఫలంగా పొందుతున్నది ఏమిటో చెప్పలేదు.


విలీన ఒప్పందం ఏ ప్రాతిపదికన జరిగిందని విలేకరులు పదేపదే ప్రశ్నించినప్పుడు ఎటువంటి షరతులు లేకుండానే పిఆర్పిని కాంగ్రెస్ పార్టిలో విలీనం చేసినట్టు తెలిపారు. అయితే ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానానికి "తన సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలో తెలుసు" అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలను చేశారు. అయితే కాంగ్రెస్ సేకరించిన సమాచారన్ని బట్టి చిరంజీవికి కేంద్రంలో మంత్రిపదవి, 2014 ఎన్నికల్లొ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా పిఆర్పీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురికి తక్షణం మంత్రి పదవులు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. జరుగుతున్నా పరిణామాలను గమనిస్తుంటే ఏ ఒప్పందాలు నిజమే అనిపిస్తోంది. అధిష్టానంపై తనకు నమ్మకం ఉన్నపటికీ కాంగ్రెస్ పార్టిని నమ్మకుదనే భయం కూడా మనుసులో వుంది. అందుకే రహస్య ఒప్పందాన్ని అధిష్టానానికి గుర్తు చేసేందుకే మంత్రి సి. రామచంద్రయ్య ద్వారా అసంతృప్తి వ్యక్తం చేయించడం వంటి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో బాగంగా ఇటివల విధ్యుత్ చార్గిల పెంపుపై చిరంజీవి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా తన మంత్రి పదవి సంగతి ఏమిటి? అని ప్రశ్నించడమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి రాజ్యసభ్యునిగా ఎన్నిక కావడం కేవలం ఉపసమనం మాత్రమే కేంద్రంలో మంత్రిపదవి స్వీకరించినప్పుడు మాత్రమే కేంద్రంలో మంత్రిపదవి స్వికరించిన్నపుడు మాత్రమే కోరిక నేరవేరినట్టు అవుతుంది. మంత్రిపదవి లభించే వరుకు ప్రకటనలు,ఉత్తరాలు రాయవలసి౦దేనని..కాంగ్రెస్ సంస్కృతీ అంత అంతేనని విషయాన్ని చిరంజీవి కూడా గుర్తించినట్టు పరిశీలకులు అభిప్రాయ పాడుతున్నారు.