‘కోటీశ్వరుడు’ హాట్ సీట్‌లో చిరంజీవి

 

నాగార్జున యాంకరింగ్ చేస్తూ వుండగా మా టీవీలో ప్రసారమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఈ సీజన్‌లో చివరి ఎపిసోడ్ ఈ గురువారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ హాట్ సీట్లో కూర్చుని నాగార్జున అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిరంజీవికి మాటీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ స్వాగతం పలికారు. బిగ్ సినర్జీ సంస్థ ఇప్పటి వరకు ఈ షో 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్‌తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు చెబుతున్నాయి.