భారత భూభాగంలోకి చైనా సైన్యం

భారత దేశంతో దూకుడుగా వ్యవహరించే చైనా సైన్యం కదలికలు మరోసారి ఉద్రిక్తలకు దారితీశాయి. గత మంగళవారం చైనా సైనికులు, జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలోకి కనీసం 6 కిలోమీటర్లు చొచ్చుకురావడంతో, భారత సైనికులు వారిని వెనక్కి పంపాల్సి వచ్చింది. ఈ సందర్భంలో ఎలాంటి కాల్పులూ చోటు చేసుకోకపోయినా, ఇరువర్గాల మధ్యా ఇంకా ఘర్షణ వాతావరణం నెలకొనే ఉంది. నిన్న మరోసారి చైనా సైన్యం లడఖ్‌లోకి దూసుకురావడంతో ఇవేవీ అనుకోకుండా జరిగిన ఘటనలుగా కనిపించడం లేదు. అయితే భారత సైన్యం మాత్రం ఈ విషయం మీద ఆచితూచి స్పందిస్తోంది. మంచు కరిగిపోయిన తరువాత, వేసవిలో సైనికులు విస్తృతంగా గస్తా కాస్తూ ఉంటారనీ... ఆ సందర్భంలో దారి తప్పే అవకాశం ఉందనీ చెబుతున్నారు అధికారులు. మరి చైనా సైనికులు దారి తప్పే వచ్చారా, కొత్త దారులు వెతుక్కుంటూ బయల్దేరారా అన్నది చూడాల్సిందే!