TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బూట్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. చైనాలో 28 మంది సజీవదహనం.!

Published on: Fri Jul 10, 2026 10:25AM

చైనాలో గురువారం (జులై 9) రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 28 మంది సజీవదహనం అయ్యారు. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో  బూట్ల తయారీకి  ప్రసిద్ధి చెందిన జిన్‌జియాంగ్ నగరంలోని ఓ పాదరక్షల ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది.  నిత్యం వందలాది మంది కార్మికులు పని చేసే  ఆ బహుళ అంతస్తుల ఫ్యాక్టరీ భవనంలో.. గురువారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎం జరుగుతోందో అర్థమయ్యేలోగానే 28 మంది కార్మికులు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు.  పలువురు గాయపడ్డారు.  

 సమాచారం అందుకున్న స్థానిక యంత్రాంగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.   200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది 35  ఫైర్ ఇంజన్లతో  మంటలను అదుపు చేశారు. షూ తయారీలో ఉపయోగించే రబ్బరు, కెమికల్స్, జిగురు వంటి మండే స్వభావం కలిగిన ముడి పదార్థాలు అక్కడ పెద్ద మొత్తంలో నిల్వ ఉంచడం వల్లే మంటలు  వేగంగా, తీవ్రంగా వ్యాపించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  

ఈ ఘోర దుర్ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడంపై  ఆవేదన వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను  వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు.  

China fire accident, shoe factory blaze, Fujian province fire, Jinjiang factory tragedy, Xi Jinping order, Huiteng shoes factory