మరోసారి మీడియాకు కేసీఆర్ వార్నింగ్..

అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మీడియాను అదుపులో పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియాను టార్గెట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలపై కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు ఒక్క వ్యక్తి కాని..ఒక్క జంతువు కాని మరణించలేదని..అయితే ఇక్కడి పరిస్థితిని ప్రసార మాధ్యమాలు అతిగా చూపి నగరానికి చెడ్డ పేరును తెస్తున్నాయన్నారు. రాజధానిలో అంతటి భయంకర పరిస్థితులేమీ లేవని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ..వాస్తవ పరిస్థితిని మాత్రమే మీడియా చూపాలని హితవు పలికారు. అతిగా చెప్పి, చూపి ఇతర ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన కలిగించవద్దని సూచించారు.