ఓయూకి పూర్వవైభవం ఖాయం-కేసీఆర్

ఉస్మానియా యూనివర్శిటీ స్థాపించి 100వ ఏడాదిలోకి అడుగుపెడుతుండటంతో శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉత్సవాల ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. అనుభవజ్ఞులు, వర్శిటీతో సంబంధం ఉన్నవారితో సలహా మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉస్మానియాలో చదివి వివిధ వృత్తుల్లో, విదేశాల్లో స్థిరపడిన వారిని ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తామని సీఎం ప్రకటించారు. త్వరలోనే వర్శిటీకి వీసీ నియామకం జరుగుతుందన్నారు.