చైనా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా చేరుకున్నారు. నిన్న రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చైనా బయల్దేరారు. ఇవాళ ఉదయం హాంకాంగ్ చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు 12 మంది సభ్యులున్నారు. రెండు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది. దీనిలో భాగంగా హాంకాంగ్ నుంచి సాయంత్రం 4.35 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరిగే టియాంజిన్ నగరానికి సీఎం బృందం చేరుకుంటుంది. చైనాతో రాజకీయ, వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకోవడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీలను ఆయన ఆహ్వానించనున్నారు.