విమానంలో మంటలు...20 మందికి గాయాలు

 

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. చికాగో విమానాశ్రయంలో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బోయింగ్‌ 767 రన్‌వేపై టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చికాగో నుంచి మియామీ వెళ్తున్న ఈ విమానంలో 161 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉండగా వారిలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని, వారిని మియామికి మరో విమానంలో పంపిస్తామని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.