ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్..ఏడుగురు మావోల హతం

వరుస ఎన్‌కౌంటర్లతో కేడర్‌ను కోల్పోతున్న మావోలకు ఛత్తీస్‌గడ్‌లో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు హతమయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు వారు తారసపడటంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోలు మరణించగా మరి కొందరు తప్పించుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు.