మావోలకు ఎదురుదెబ్బ... 5 హతం..


మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ఆంధ్రా ఒడిశా సరిహద్దులో (ఏవోబీ)  జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు  చత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ అటవీ ప్రాంతంలో తమకు తారసపడ్డ మావోలను భద్రతాదళాలు చుట్టుముట్టగా, ఇరు పక్షాలు కాల్పులకు దిగడంతో ఇప్పటివరకూ ఐదుగురు మావోలు హతమైనట్టు తెలుస్తోంది. మిగతా మావోలు పారిపోగా, కాల్పుల ఘటనలో మృతి చెందిన మావోయిస్టులు ఎవరన్న విషయం తెలియాల్సి వుంది. కాగా పోలీసులు పారిపోయిన వారికోసం కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు.