ఉప్పల్ టెస్ట్: పూజారా డబుల్ సెంచరీ,అవుట్
Published on: Mon Mar 4, 2013 10:39AM

హైదరాబాద్ ఉప్పల్ లో ఆస్ట్రేలియా తో జరుగుతున రెండో టెస్టు మూడో రోజు పూజారా డబుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో పుజారా టెస్టుల్లో వెయ్యి పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇది టెస్టులో రెండో డబుల్ సెంచరీ. ఇంతకుముందు ఇంగ్లాండ్ పై ద్విశతకం చేశాడు. 311/1తో మూడో రోజు బరిలోకి దీగిన భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో వికెట్ కు 370 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పిన తరువాత మురళి విజయ్ 361 బంతుల్లో 161 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆతరువాత డబుల్ సెంచరీ చేసిన పూజారా కూడా మూడో వికెట్ గా వెనుదిరిగాడు. లంచ్ విరామానికి ఇండియా స్కోరు 400/3. సచిన్ మూడు పరుగులు, కోహ్లి నాలుగు పరుగులతో ఆడుతున్నారు.


