మెడికో పైశాచికం.. బతికిన శునకం..

 

చెన్నైకి చెందిన గౌతమ్ అనే మెడికో అతి పైశాచికంగా శునకాన్ని భవంతిపై నుండి పడేసిన సంగతి తెలిసిందే. పడేయటమే కాదు.. తను చేసే ఘనకార్యాన్ని వీడియో తీసి మరీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే గౌతమ్ చేసిన పనికి నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా టెర్రస్ పై నుండి పడేసిన శునకం చనిపోయిందేమో అని అందరూ భావించినా.. అదృష్టవశాత్తు అది బ్రతికింది. దాని కాలుకు మాత్రం దెబ్బ తగిలినట్టు.. కుక్కను కాపాడిన కార్తీక్ దండపాణి, శ్రవణ్ అనే యువకులు చెబుతున్నారు. ఆ కుక్కకు చికిత్స చేయిస్తున్నామని కార్తీక్ చెప్పారు. ఇంకా సమాచారం అందుకున్న పోలీసులు గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు.

 

ఇదిలా ఉంటే గౌతమ్ చేసిన ఈ పైశాచిక చర్యపై సెలబ్రిటీల సైతం స్పందించి అతనిపై మండిపడుతున్నారు. హీరో సిదార్ధ్, హీరోయిన్ ఇషాచావ్లా వంటి సెలబ్రెటీలు స్పందించి అతనిని కఠినంగా శిక్షించాలని అన్నారు.