మహారాష్ట్ర సీఎంగా షిండే..చవాన్ అవుట్!

 

 

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి నుంచి పృధ్విరాజ్ చవాన్ త్వరలో తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పదవిలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకి ఆ బాధ్యలు అప్పగిస్తారని సమాచారం. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రెండే స్థానాలు రావడం, మిగిలిన స్థానాలు బిజెపి,శివసేన కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పృధ్విరాజ్ చవాన్ పనితీరుపై అసంతృప్తిగా వుంది. ఇంకా కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి ని మార్చకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కూడా ఎన్నికల ముందు షిండే కి పగ్గాలు అప్పగించగా, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి కూడా అతనికే పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది.