మీడియాకు విన్నపం.. వాటిని హైలైట్ చేయండి చాలు..
posted on Apr 2, 2018 11:24AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం పార్టీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ...బీజేపీ నమ్మించి మోసం చేసిందని... అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు కూడా విలువ లేకపోతే ఎలాగని ఆయన అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే తాను ఢిల్లీ పర్యటన చేపడుతున్నట్టు చెప్పారు. తన ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని..తెలిపారు. వైసీపీ చేస్తున్న లాలూచీ రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. అందుకే పార్లమెంటు సమావేశాల చివరి రోజున రాజీనామాల డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.అంతేకాదు ఈ సందర్బంగా ఆయన మీడియాకు ఓ సూచన కూడా చేశారు. రాజకీయాలను హైలైట్ చేయవద్దని... రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే హైలైట్ చేయాలని కోరారు.