వైఎస్ఆర్ దొంగల పార్టీ

 

 

chandrababu yatra, chandrababu bus yatra, chandrababu seemandhra yatra

 

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మూడు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు కుట్రలు చేస్తున్నాయి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీ అభివృద్ది చేసే పార్టీ....ఈసారి టిడిపి అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలంతా తెలుగుదేశం పార్టీతో కలిసి రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు దాడులకు తెగబడుతున్నాయని, ఆ పార్టీలు దాడులు చేసి తమ పార్టీని విమర్శిస్తున్నారని చంద్రబాబు తప్పపట్టారు.


నిజానికి చంద్రబాబు సీమాంద్ర ప్రజల ఆందోళనకు మద్దతు పలకడానికి గాను పర్యటన చేస్తున్నారు. కాని ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలా?వద్దా అన్నదానిపై నేరుగా మాట్లాడలేని పరిస్థితి ఉంది.