విజయనగరంలో ధర్నాకు ర్యాలీగా బయల్దేరిన చంద్రబాబు
Published on: Mon Apr 23, 2012 12:49PM
విజయనగరంలో ధర్నాకు చంద్రబాబు టీడీపీనేత అశోక్ గజపతి రాజు ఇంటి నుంచి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు. కలెక్టరేట్ చుట్టూ వంద మీటర్ల దూరంలో బారి కేడ్లు ఏర్పాటు చేసిన వాటిని తొలగించుకొని టిడిపి నేతలు ముందుకు వెళ్ళుతున్నారు. కాగా టిడిపి కంటే ముందే డిసిసి అధ్యక్షుడు పాలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి థియేటర్ మీదుగా ధర్నా ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయల్దేరారు. ఇటు బొత్స సత్యనారాయణ, అటు చంద్రబాబు శ్రేణులు ఇచ్చిన ధర్నా పిలుపుతో విజయ నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతో విజయ నగరమంతా పోలీస్ దిగ్బంధనంలో ఉంది. ముగ్గురు ఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు, 20 మంది సీఐలు, 85 మంది ఎస్.ఐలు, 3400 మంది పోలీస్లు మొహరించారు.


