50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ భారీ విగ్రహం!!

 

ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎన్టీఆర్‌ పార్కు, వావిలాల గోపాలకృష్ణయ్య ఘాట్‌ను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్‌ సాగర్‌లో బోటులో విహరించారు. ఆ తర్వాత స్థానికంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకు తారకరామసాగర్‌గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్‌ రావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి తదితరులు పాల్గొన్నారు.