చంద్రబాబు టి.బిల్లును అడ్డుకుంటారా!

 

 

 

రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం సమన్యాయం చేయకుంటే తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.


విభజన రాష్ట్ర ప్రజలందరికి సంబందించిన విషయం గనుక తప్పనిస సరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో జరిగిన మూడు రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలోను అసెంబ్లీ తీర్మాణాలను పరిగణలోకి తీసుకునే విభజన చేశారని ఆయన గుర్తు చేశారు. కేసుల మాఫీ కోసమే జాతీయ నాయకుల చుట్టూ జగన్ తిరుగున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ సంప్రదాయల ప్రకారం విభజన జరగకపోతే వ్యతిరేకిస్తామని చంద్రబాబు తెలిపారు.