నా ఇల్లు ముంచటానికే జనం ఇళ్ళు ముంచారు: ప్రభుత్వం పై బాబు ఫైర్

 

 

ఇప్పుడిపుడే కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పడుతోంది. ఐతే ఇది ప్రభుత్వం కావాలని తెచ్చిన వరద అని ప్రతిపక్ష టీడీపీ విమర్శిస్తుండగా ముంపు ప్రాంతం లో ఉన్న ఇంట్లో బాబు ఉంటున్నారని అధికార వైసిపి పరస్పరం విమర్శించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ముంపుకు గురైన విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేత చంద్రబాబు పర్యటించారు.ఈ నియోజకవర్గంలోని గీతానగర్, భూపేశ్ గుప్తా నగర్, తారకరామా నగర్ లతో సహా పలు ప్రాంతాల  ప్రజలను అయన కలుసుకుని పరామర్శించారు. ఈ సందర్బంగా కరకట్ట వెంట ప్రజలను పలకరించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో  మాట్లాడుతూ, కరకట్ట వెంబడి రక్షణగోడను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని, ఇదే ప్రజలందరి డిమాండ్ అని అన్నారు. ఇక్కడి నుంచి ప్రజలను తరలిస్తామని మంత్రులు అనడం తగదని, ఇక్కడ నివాసం ఉంటున్న వారందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బాబు డిమాండ్ చేశారు. వరదసహాయ చర్యలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని అయన విమర్శించారు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ  ‘నా ఇల్లు ముంచడానికే ప్రజల ఇళ్లు ముంచారు’ అని అయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.