చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు
Published on: Fri Sep 20, 2024 12:45PM

ప్రతికూల వాతావరణం కారణంగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' చేపట్టిన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ రోజు రెండు సభలలో పాల్గొనాల్సి ఉంది. తొలి సభ శ్రీకాకుళంలో జరగాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన శ్రీకాకుళం పర్యటన రద్దైంది. దీంతో ఆయన ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు లో జరిగే సభలో మాత్రమే పాల్గొంటారు.


