ఆధారాలు బయట పెట్టేసరికి జగన్ ప్లేటు ఫిరాయించారు!

 

ప్రతిపక్షంపై ఆరోపణలకే సభా సమయాన్నంతా వైసీపీ దుర్వినియోగం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక టీడీపీని లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. తాజాగా టీడీపీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే  పోలవరం పనులు 66 శాతం పూర్తయ్యాయన్నారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తెచ్చుకోవడం చేతకాకే వైసీపీ ఆరోపణలు చేస్తోందని బాబు మండి పడ్డారు.

అర్థంలేని అవినీతి ఆరోపణలతో విలువైన శాసనసభ సమయాన్ని వృథా చేస్తున్నారని బాబు విమర్శించారు. విచారణల పేరుతో కాలం గడిపేయాలని జగన్‌ చూస్తున్నారన్నారు. అవినీతి ఆరోపణల ద్వారా పోలవరం పనులను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని, విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పీపీఏలపై బురద చల్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం చివరకు అభాసుపాలైందని అన్నారు. సున్నావడ్డీ రుణాలు టీడీపీ ఇవ్వలేదని జగన్‌ చెప్పారు. ఆధారాలతో సహా బయట పెట్టేసరికి ప్లేటు ఫిరాయించారని బాబు ఎద్దేవా చేశారు. కియా వైఎస్‌ తెచ్చారని బుగ్గన చెప్పడం హాస్యాస్పందంగా ఉందని చంద్రబాబు అన్నారు.