బాబు ఓటు వైసీపీకి పడిందా?.. ఆయన కోవర్టు!!

 

ఈవీఎంల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తన ఓటు తనకే పడిందా? అని అన్నారు. తాను వేసిన ఓటు తన పార్టీకే వెళ్లిందా? లేక వేరే పార్టీకి వెళ్లిందా?అని సందేహం వ్యక్తం చేశారు. గతంలో ఓటేస్తే నమ్మకం ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.

అదేవిధంగా ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించడంపైన కూడా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ పదవిలో ఒక సహ నిందితుడిని నియమించారని విమర్శించారు. అంతేకాకుండా కోవర్టుగా ఉన్న వ్యక్తిని సీఎస్‌గా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు.