బాబు దగ్గరికి వెళ్లండని 'సీఈఓ'కి వైఎస్ ఆత్మ చెప్పింది!!

 

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కియా మోటార్స్ విషయంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సెటైర్లు వేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కారణంగానే ఏపీకి కియా మోటార్స్ పరిశ్రమ వచ్చిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బాబు స్పందించారు. "రాజేంద్రనాథ్ రెడ్డిగారూ.. చాలా తెలివైన వాళ్లు మీరు. హ్యాట్సాఫ్. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే, 2009లో రాజశేఖరరెడ్డి చనిపోయారు. ఆయన ఆత్మ వెళ్లింది ఆ సీఈఓ దగ్గరకు. 2016లో మీరు చంద్రబాబు దగ్గరకు వెళ్లండి. ఆయన అన్నీ ఇస్తారు. ఇన్సెంటివ్స్ అన్నీ. అన్ని పనులు చేస్తారు.. పెట్టమని ఆయన చెప్పారు. ఆయనొచ్చి పెట్టారు. అదీ మీరు చెప్పే కథ. మీరు ఎంత గొప్పనాయకులంటే, ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది. మీకు కంగ్రాచ్యులేషన్స్" అని చంద్రబాబు సెటైర్లు వేశారు.