జేసీపై చంద్రబాబు సీరియస్..!!

ఒకవైపు టీడీపీ, ఎన్డీయే ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టి మిగతా పార్టీల మద్దతు కూడగడుతుంటే.. మరోవైపు సొంత పార్టీ నేతనే టీడీపీకి తలనొప్పిగా మారారు.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాను హాజరు కావట్లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

 

చంద్రబాబు అవిశ్వాస తీర్మానం మద్దతు కోసం పలు పార్టీలకు లేఖలు రాసారు, అలానే పలువురు నేతలతో ఫోన్లో మాట్లాడారు.. దేశం వ్యాప్తంగా పలువురి మద్దతు కూడగట్టిన చంద్రబాబు, సొంత పార్టీ ఎంపీ మద్దతు కూడగట్టుకోలేకపోయారనే అపవాదు వచ్చే ప్రమాదముంది.. అందుకే, జేసీ ఎపిసోడ్‌ను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.. సాయంత్రం కల్లా జేసీ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్న అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. జేసీ వ్యవహారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.