రోడ్ షోలో చంద్రబాబు... ఇప్పుడేం పొడుస్తాడు...

 

ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. అయ్యలూరిమెట్లలో చంద్రబాబు రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నంద్యాలలో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల అభివృద్ధి భూమా నాగిరెడ్డి కోరిక అని.. కాంగ్రెస్ పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడేం చేస్తుందని అన్నారు. నంద్యాలలో వైసీపీ చాప చుట్టేయడం ఖాయం..ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస జగన్ కు లేదు..రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని అన్నారు. నంద్యాలను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా..పోలవరం నిర్మాణ పనులు చూసి పార్లమెంటరీ కమిటీ అభినందించింది.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం..ఒకప్పుడు జలయజ్ఞం..ధనయజ్ఞంలా మారిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిపై కూడా ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నంద్యాలకు ఆయన ఏమీ చేయలేదని... ఇప్పుడు గెలిచి ఆయన పొడిచేముందని అన్నారు. డబ్బు సంపాదనే వైసీపీ నేతల లక్ష్యమని చెప్పారు. టీడీపీపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని... అన్నీ అబద్దాలే చెబుతున్నారని మండిపడ్డారు.