బీజేపీ పై పోరుకు సిద్దమంటూ చంద్రబాబు లేఖ 

 

ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తుందని ఇప్పటికే సీఎం భాజపాపై పలుమార్లు నిరసన వ్యక్తం  చేస్తూవస్తున్నారు. పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు మొదలవబోతున్న నేపధ్యంలో మరోమారు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తెదేపా నిర్ణయించుకుంది. దీనికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు భాజపా వ్యతిరేక పార్టీలకు లేఖ రాసారు . ఇప్పటికే తెదేపా ఎంపీలు పలువురు పార్టీ నాయకులను కలిసి కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు కోరటంతో పాటు తమ నాయకుడు చంద్రబాబు రాసిన లేఖ సహా విభజన చట్టంలోని హామీల శీర్షికను అందజేయటం జరిగింది.