అనుమానమే లేదు.. ఏపీలో టీడీపీదే అధికారం

 

ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో.. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. నూటికి నూరు శాతం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఎగ్జిట్‌పోల్స్‌ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. 23వ తేదీన వెలువడే ఫలితాల్లో టీడీపీకి 110 నుంచి 130 సీట్లు వస్తాయని, 18 నుంచి 20 పార్లమెంట్‌ సీట్లను గెలవబోతున్నామని తెలిపారు.