తెలంగాణలో 'ప్రజాగర్జన'

 

 

 

ఇటీవల తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన ప్రజాగర్జన సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చి విజయవంతం కావడంతో..ఈ సభలను తెలంగాణలోనూ నిర్వహించాలని టిడిపి నిర్ణయించింది. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమైన చంద్రబాబు..పొత్తుల విషయం పక్కన పెట్టి ప్రతి నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచాలని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెలాఖరు లోపు విస్తృత సమావేశాలు నిర్వహించి, తర్వాత నియోజకవర్గాలవారీగా పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తెలంగాణలో రెండుచోట్ల జోనల్ సభలు నిర్వహించాలనీ నిర్ణయం తీసుకొన్నారు.