సోలార్ హబ్ గా ఏపీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో ఏపీలోని పవర్ ప్రాజెక్టులకు ఇతర రాష్ర్టాల నుంచి బొగ్గు కేటాయిస్తున్నామని వెల్లడించారు. దేశంలో కరెంటు కోతలు లేకుండా చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏపీని సోలార్ హబ్ గా మారుస్తామని గోయెల్ హామీ ఇచ్చారు. సోలార్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని, ఈ కమిటీ పదిహేను రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తుందని పీయూష్ తెలిపారు.