ప్రజావేదిక సంగతి సరే మరి వైఎస్ విగ్రహాల సంగతేంటి

 

 

ఆరు రోజుల పాటు యూరప్ పర్యటన ముగించుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు దేశం లో లేని సమయంలో చోటు చేసుకున్న పరిణామాల పై ఈ రోజు పార్టీ నేతలతో చర్చించారు. ఏపీలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల పై జరుగుతున్న దాడుల పై నేతలు బాబుకు వివరించారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్ తాజా నిర్ణయమైన ప్రజావేదిక కూల్చివేత పైన చంద్రబాబు స్పందిస్తూ అది సరైన   ఆలోచన కాదని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను అనుమతి లేకుండా ఊరూరా ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ మరి వాటి సంగతేమిటని అయన ప్రశ్నించారు.