ప్రచారానికి సై సై..

రేణిగుంట విమానాశ్రయం ఘటనతో చంద్రబాబు ఈగోను రెచ్చగొట్టింది వైసీపీ సర్కార్. ఇక అధికార పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ రంగంలోకి దిగారు. జూలు విదిలించిన సింహంలా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సై సై అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే చోట్ల ఐదు రోజుల పాటు ప్రచారంలో పాల్గొననున్నారు చంద్రబాబు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచార షెడ్యూలును తెలుగు తమ్ముళ్లు సిద్ధం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. ఈ జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. త్వరలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున చంద్రబాబు పురపాలక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.