చంద్రబాబు ఇంటివద్ద నకిలీ సీబీఐ..!

 

మరోసారి మాడీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ పేరు వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి దీనికి కారణం ఆయన కాదు.. ఓ మహిళ. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే. ఓ మహిళ చంద్రబాబు నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరగుతుండటంతో ఆమెను గమనించిన పోలీసులు... ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె.. తన పేరు ఎర్విన్ రీటా అని.. సచివాలయానికి వెళుతున్నాన అని చెప్పింది. ఆ తరువాత... తాను సీబీఐ అధికారిని.. మళ్లీ మాట మార్చి తాను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యనని చెప్పింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని భావించిన పోలీసులు రీటాను అదుపులోకి తీసుకున్నారు. రీటా దగ్గర ఉన్న ఓ పత్రంలో ఆమె పేరు ఎర్విన్ రీటా అని - భర్త పేరు వీవీ లక్ష్మీనారాయణ అని ఉంది. ప్రస్తుతం రీటా నుంచి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

కాగా లక్ష్మీనారాయణ.. కొద్ది రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజకీయాల్లోకి రావడానికే పదవికి రాజీనామా చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. అంతేనా ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ.. కొంతమంది అంటే.. లేదు ఆయన జనసేనలోకి వెళుతున్నారంటూ మరి కొంతమంది అన్నారు. ఆఖరికి ఈ వార్తలపై స్పందించిన లక్ష్మీ నారాయణ...తాను ఏపార్టీలో చేరడం లేదని.. తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని - త్వరలోనే తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు.