చంద్రబాబు, లోకేశ్ లపై పోస్టులు... వ్యక్తి అరెస్ట్...
posted on Aug 22, 2017 4:38PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని తనయుడు నారా లోకేశ్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కలిగనూరు గ్రామానికి చెందిన బసవరాజు (30) అనే వ్యక్తి ఫేస్బుక్లో ‘వైఎస్ఆర్సీపీ అన్అఫీషియల్’ అనే పేజ్ని సృష్టించి చంద్రబాబు, లోకేశ్ పై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి మహిళలు కొడుతున్నట్లు పోస్టులు చేస్తున్నాడని అన్నారు. వారితో పాటు ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణపై కూడా ఆయన అభ్యంతరకర ఫొటోలు పెట్టారని చెప్పారు. దీంతో అతడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాగా ఇటీవలే ప్రశాంత్ కిషోర్ కూడా టీడీపీ పై సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే.