బాబుకు జూనియర్‌ అభిమానుల షాక్‌

 

కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్‌ విగ్రహానిరి పూలమాల వేయడానికి సమయం చాలదంటూ చంద్రబాబు వ్యాఖ్యనించార్న వార్తలతో జూనియర్‌ అభిమానులు ఆయన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

సోమవారం కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడం మండలం, మెట్టగూడెం చేరుకున్న బాబును ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా అభిమానులు కోరారు. సెక్యూరిటీ, సమస్యలతో పాటు ఇతర కారణాలతో చంద్రబాబు అందుకు నిరాకరించటంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.


పార్టీ నేతలు కలగజేసుకొని పరిస్థితిని వివరించటంతో అభిమానులు శాంతించారు. అంతకు ముందు చంద్రబాబు మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలోవినాయక పూజలో పాల్గొన్నారు.