ఇటలీ, ఇడుపులపాయ మైత్రితో కుట్ర
posted on Sep 5, 2013 3:48PM
రాష్ట్ర విభజనను కాంగ్రెస్ సొంత నిర్ణయంలా తీసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. మండిపడ్డారు. తెలంగాణ సమస్య పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. టీఆర్ఎస్ విలీనం కోసం రాష్ట్రంలో మరో సమస్యను సృష్టించిందని బాబు మండిపడ్డారు. ఈ విషయంపై ఒకసారి యువత ఆలోచించాలని కోరారు.
టీఆర్ఎస్, వైసీపీ పార్టీలను విలీనం చేసుకుని మెజార్టీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం హైదరాబాద్ గురించి మాట్లాడేవారు హైదరాబాద్కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రలో ఆందోళనలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటలీ, ఇడుపుల పాయకు మైత్రి కుదరడంతోనే తెలుగుజాతికి కుట్ర జరిగిందని ఆయన అన్నారు. ఉద్యమాల వల్ల సీమాంధ్ర, తెలంగాణలో అనేక మంది చనిపోయారన్నారు. దీనికి కాంగ్రెస్సే కారణమని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగు జాతి తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని బాబు అన్నారు. సోనియా చేతిలో ప్రధాని కీలుబొమ్మలా మారారని, లక్షల కోట్లు అవినీతి జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.