బాబు దీక్షలో 'రాయపాటి '

 

 chandrababu deeksha, rayapati chandrababu, telangana, seemandhra, delhi

 

 

రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొంటున్న రాజకీయ సమీకరణాలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇందుకు సాక్ష్యం గ రాయపాటి నేడు ఢిల్లీ లో బాబు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియ చేయటం. దీని మూలంగా రాయపాటి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరవచ్చు ననే సంకేతాలు ప్రజలకు అందుతున్నాయి. విభజన నేపధ్యంలో కాంగ్రెస్ లో ఎం.పి గా కొనసాగుతున్న తన పదవికి విభజన ప్రకటన అనంతరం రాజీనామా చేసిన విషయం విదితమే. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ నుండి బలమైన నాయకుడిగా ఉన్న లాల్ జాన్ పాషా ను కోల్పోయిన ఆ పార్టీకి ఇది చాలా కలిసివచ్చే అంశం. రాయపాటి టి.డి.పి లో చేరితే సీమాంధ్ర లో ఆ పార్టీ బలపడటం ఖాయం.