ఉల్లి ధర పై ట్విట్టర్‌లో చంద్రబాబు

 

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఉల్లి ధర కిలో రూ.90కి చేరుకోవడం పై ఆయన స్పందించారు. ధరలపై యూపీఏ ప్రభుత్వం మాటలే తప్ప చేతలు లేవని ట్వీట్ చేశారు. ఉల్లి ధర కిలో రూ.90కి చేరుకోవడం బాధాకర మని, అంత రేటు పెట్టి ఉల్లి కొనాలంటే గృహిణి కంట నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో ఐటీ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.