చంద్రబాబు, పవన్.. ఎడమొహం, పెడమొహం..!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి నడిచారు.. తర్వాత బాబుని విభేదించి, ఇప్పుడు 2019 ఎన్నికల వైపు ఒంటరిగా అడుగులు వేస్తున్నారు.. విడిపోయాక చంద్రబాబు, పవన్ కలిసిన సందర్భాలు లేవు.. ఒకవేళ వీరిద్దరూ ఏదైనా కార్యక్రమంలో ఎదురైతే ఎలా ఉంటారు? ఏం మాట్లాడుకుంటారు ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు.. ఆరోజు రానే వచ్చింది.. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో వేంకటేశ్వరస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ హాజరయ్యారు.. కానీ ఇద్దరూ ఎడమొహం, పెడమొహం గానే ఉన్నారు.. పక్కపక్కనే ఉన్నా ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు.. దీంతో ఏం మాట్లాడుకుంటారని ఆసక్తిగా ఎదురుచూసినవాళ్లు కాస్త ఏం మాట్లాడుకోలేదేంటని ఆశ్చర్యపోతున్నారు.