మోడీపై బాలయ్య కామెంట్లు.. ముందు భార్యను ప్రేమించు...


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేష రంభ అంటారని...ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని, అద్వాణీని గౌరవించలేని వ్యక్తి మీరు అని విమర్శించారు. అంతేకాదు.. కట్టుకున్న భార్యను కూడా మీరు గౌరవించడం లేదని...ముందు భార్యను ప్రేమించడం నేర్చుకోవాలంటూ హితవు పలికారు. అమిత్ షా లాంటివారు పక్కన ఉండి డప్పు కొడుతుంటే... రోజులు గడిపేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఉండేవని... ఇప్పుడు బీజేపీ ఈ స్థాయిలో ఉండటానికి ఎన్టీఆర్, చంద్రబాబులే కారణమని బాలయ్య చెప్పారు. ఏపీకి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని చెప్పారు.