గన్ మెన్ లపై అనుమానం.. వెనక్కి పంపించిన పవన్...

 

ఏపీ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  గత నెలలో గుంటూరులో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనపై దాడి జరిగే అవకాశముందని పవన్ పేర్కొనడంతో, దీనిపై స్పందించిన ప్రభుత్వం 2 ప్లస్ 2 గన్ మెన్ లను కేటాయించింది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఓ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.... తనకు కేటాయించిన భద్రతా సిబ్బందిని పవన్ వెనక్కి పంపేశారు. భద్రతా సిబ్బందిని ప్రభుత్వం నిఘా కోసం వాడుకుంటోందనే అనుమానంతో పవన్ వారిని తిప్పి పంపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నలుగురు గన్ మెన్లకు ఈ విషయాన్ని తెలిపిన పవన్ సిబ్బంది, ప్రభుత్వానికి సరెండర్ కావాలని సూచించారు. ‘జనసేన’లో జరుగుతున్న వ్యవహారాలను కనిపెట్టేందుకే ప్రభుత్వంలోని పెద్దలు తనకు సెక్యూరిటీ కల్పించినట్టు పవన్ భావిస్తున్నట్టు సమాచారం.