పార్టీ ఎంపీలపై చంద్రబాబు ఫైర్...

 

టీడీపీ ఎంపీలపై పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో చంద్రబాబు నిన్న అఖిలపక్షం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ మీటింగ్ లో ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు వెళ్లినప్పుడు అక్కడున్న ఎంపీలు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఉదయం ఎంపీలతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్ లో గుర్తు చేసిన చంద్రబాబు ఎంపీలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఇమేజ్ ను, పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసేలా కొందరు ఎంపీలు వ్యవహరిస్తున్నారని... ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ఢిల్లీకి వచ్చి తెలుగువారికి సహకరించడం ఎంపీల బాధ్యతని గుర్తు చేశారు. ఏపీ భవన్ ను సమన్వయ వేదికగా వినియోగించుకోవాలి.. ఏ ఎంపీ కూడా కేంద్రమంత్రులను రహస్యంగా కలుసుకోవద్దని ఆదేశించారు. ఈ విషయంలో ఎంపీలంతా జాగ్రత్తగా ఉండాలని, వారి చర్యలను అందరూ గమనిస్తున్నారని, మీడియా ముందు, విపక్షాల ముందు పరువు తీసేలా ప్రవర్తించ వద్దని హితవు పలికారు.