విజయసాయిరెడ్డి కౌంటర్.. పీఎంవోలోనే కాపురం పెట్టుకోండి.. మాకేంటి..

 

నేను ప్రధాని మోడీని కలుస్తా.. ఎన్నిసార్లైనా కలుస్తా.. మీకెందుకు.. చంద్రబాబుకు ఎందుకు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా మీద చిందులు వేసిన సంగతి తెలిసిందే కదా. ఇక విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు ఆయనపై కామెంట్లు విసిరారు. ఓ దొంగ, ఓ అవినీతిపరుడు ప్రధాని మోదీని కలిస్తే... ఇక మనం చెప్పేదేముంటుందని... నేరస్థులకు పీఎంవో గస్తీ కాస్తుందా అని ప్రశ్నించారు. పీఎంవో చుట్టూ తిరిగే విజయసాయి రెడ్డి తనను బోనులో పెట్టిస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకుముందు మాజీ నేరస్తుడు సీబీఐ డైరెక్టర్‌ను కలిస్తే కేసు పెట్టారు.. ఇప్పుడు ఏకంగా ఒక నేరస్థుడే పీఎంవోకి రెగ్యులర్ విజిటర్ అయిపోయాడు..దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని ప్రశ్నించారు. అంతేకాదు నేను ఎన్నిసార్లైనా మోడీని కలుస్తా అని అంటున్నారు.. అవసరమైతే పీఎంవోలోనే కాపురం పెట్టుకోండి... మాకు నష్టం ఏంలేదని సెటైర్ వేశారు.