జేసీ కోరిక చంద్రబాబు తీరుస్తారా..!

 

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి తన కొడుకు రాజకీయ రంగ ప్రవేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి..పార్లమెంట్ కు వెళ్లాలన్న ఆసక్తి ఉందని.. " చంద్రబాబు కనికరిస్తే, మా వాడే కింగ్. వాడికి పార్లమెంట్ కు పోటీచేయాలని ఉంది. బాబు కరుణిస్తే, అనంతపురం అభ్యర్థి నా కుమారుడే" అని అన్నారు. "వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయబోవడం లేదు. పార్లమెంట్ లో చేయడానికి ఏముంది?" అని ప్రశ్నించిన జేసీ, ఎంపీలు కరివేపాకుల్లా మారారని, వారిని పలకరించే వారు కూడా ఉండరని చెప్పుకొచ్చారు. మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి తన మనసులోని మాటను చెప్పాడు.. మరి చంద్రబాబు జేసీ కోరికను నెరవేరుస్తాడా..? లేదా..? చూద్దాం...