హెచ్ఐసీసీ, మెట్రోలపై చంద్రబాబు రియాక్షన్...

 

హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రారంభం..హెచ్ఐసీసీలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ రెండూ నిన్ననే జరిగాయి. ఇక ఈ విషయాలపై ఇప్పటికే ఎంతో మంది స్పందించారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీటిపై స్పందించి.. హైదరాబాదుకు మెట్రో రైలు తన వల్లే వచ్చిందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర ఏమాత్రం పోయేది కాదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను మెట్రో కోసం పోరాడానని తెలిపారు. ప్రస్తుతం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ జరుగుతున్న హెచ్ఐసీసీ, అలాగే శంషాబాద్ విమానాశ్రయం ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివేనని చంద్రబాబు గుర్తు చేశారు. తనకు హైదరాబాదును అభివృద్ధి చేశానన్న సంతృప్తి ఉందని, అది చాలని చెప్పారు.