బాబు పాదయాత్రకి బ్రేకుల్లేవు

 

చంద్రబాబు తన పాదయాత్రను యధావిధిగా కొనసాగించనున్నారు. నిన్న కొలకలూరులో జరిగిన చిన్న ప్రమాదంలో ఆయనకి కుడికాలు బెణికింది. ఈ రోజు హైదరాబాదు నుండి వచ్చిన డాక్టర్లు మరోమారు పరీక్ష చేసిన అనంతరం వారి సలహా మేరకు బాబు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. నిన్న ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆయన నడవాలని ప్రయత్నించినా కాలునొప్పి ఎక్కువగా అవడంతో కేవలం మరో కిమీ దూరం మాత్రమే నడిచి పాదయాత్ర విరమించుకొన్నారు. హరికృష్ణ, జూ.యన్టీఆర్, మరియు చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి బాబును ఫోన్ లో పరామర్సించగా లోకేష్ మాత్రం స్వయంగా కొలకలూరువచ్చి తండ్రిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొన్నారు. శరద్ పవర్ కూడా చంద్రబాబును ఫోన్ లో పరామర్శించి, ఆరోగ్యం జాగ్రతగా కాపాడుకోమని సూచించారు.