మంత్రి కొండ్రు మురళి కి మదపిచ్చి!

 

 

chandrababu, minister kondru murali, tdp congress jagan kondru murali

 

 

చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని మంత్రి కొండ్రు మురళి మోహన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. కొండ్రు మురళి అధికార మదంతో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్‌కు అంతిమయాత్ర అని ఆయన కొత్త నినాదం ఇచ్చారు. వైఎస్ జగన్ అవినీతిలో కొండ్రుకు వాటా ఉందని, ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబును పార్టీ అద్యక్ష పదవి నుంచి మార్చాలని మురళీమోహన్ సూచించగా, లిక్కర్ డాన్‌గా పేరొందిన కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చుకోండని బాబు రాజేంద్ర ప్రసాద్ సూచించారు.