కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ: చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర రుణ మాఫీ చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. రైతు రుణమాఫీ అంశంపై కోటయ్య కమిటీ నివేదిక తనకు అందిన సందర్భంగా చంద్రబాబు సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి, చెల్లించని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. రుణమాఫీలో అక్రమాలు జరగకుండా కోటయ్య కమిటీ కొన్ని సూచనలు చేసిందని చంద్రబాబు తెలిపారు. రైతు రుణ మాఫీ కోసం 37,900 కోట్లు అవసరమవుతాయని, ఎఫ్ఆర్‌బిఎం పథకం ద్వారా 25 వేల కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవచ్చని చంద్రబాబు చెప్పారు.